సహజ రంగులతో హోలీ వేడుకలు జరుపుకోవడం అభినందనీయం
సూర్యాపేట, మార్చి 3 (విజయక్రాంతి) : మానవాళికి హాని చేయని సహజ రంగులతో హోలీ వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని మున్సిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్ష్యాది తెలిపారు. మంగళవారం హోలీ పండుగలు పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద గ్రీన్ క్లబ్ ట్ర స్ట్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ ప్రజలు ప్రశాంత వాతావరణంలో కులమతాలకతీతంగా హోలీ వేడుకలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ సిద్ధమైన హోలీ రంగులతో వేడుకలు నిర్వహించుకోవడం శుభపరిణామం అన్నారు. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు హోలీ రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్, ప్రముఖ న్యాయవాది జి శశిధర్ గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షులు ముప్పారపు నరేందర్ ప్రధాన కార్యదర్శి తోట కిరణ్ తో పాటు ముప్పారపు నాగేశ్వరరావు, రాచర్ల కమలాకర్ , రాచకొండ శ్రీనివాస్, డి.నాగరాజు, శ్రవణ్ కుమార్, ఉప్పల శ్రీదేవి, సువర్ణ లక్ష్మి, హేమమాలినిలు పాల్గొన్నారు.




