calender_icon.png 27 June, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ ఆర్ఆర్ఆర్ ఏడాది పాలనపై సంబరాలు

05-06-2025 05:58:26 PM

ఆటో డ్రైవర్ లకు ఖాకీ చొక్కాల పంపిణీ..

కొత్తగూడెం (విజయక్రాంతి): ఎంపీ రామసహాయం రఘు రాంరెడ్డి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు ఎన్నికై ఏడాది అయిన సందర్బంగా, కొత్తగూడెం విద్యానగర్ లోని రెవిన్యూ మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం(Minister Ponguleti Srinivasa Reddy Camp Office)లో గురువారం కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, జేవిఎస్ చౌదరి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తోట దేవి ప్రసన్న తదితరులు హాజరై కేక్ కట్ చేసి ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం వారు ఎంపీ ఏడాది పాలన గురించి మాట్లాడుతూ... రామ సహాయం రఘు రాంరెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి భరోసా కల్పిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారన్నారు. ప్రత్యేకంగా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం తపిస్తూ కొత్తగూడెం విమానశ్రయం ఏర్పాటుపై కేంద్ర మంత్రిపై ఒత్తిడి తెచ్చి ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా బృందంతో సర్వే జరిగేలా చేశారన్నారు. ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలిగించడంతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల ఎన్ఆర్ఈజీఎస్, ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేశారన్నారు.

ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎంపీ ఆర్ఆర్ఆర్ రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ మరింత పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో టెలికాం కమిటీ సభ్యులు కనకరాజు, రైల్వే బోర్డు సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఐఎన్టీయూసి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, మాజీ కౌన్సిలర్ తలుగు అనిల్, కాంగ్రెస్ నాయకులు సుందర్ లాల్ కోరి, ఆకుల సుధాకర్, జానీ, గొల్ల శీను, కేకే శ్రీను, సుందర్ రాజ్, మహిళ నేతలు జోగు రమాదేవి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.