05-06-2025 05:46:59 PM
కమీషన్ల కోసమే పాలన..
ఈనెల 7 నుండి రాష్ట్రంలో బిజెపి వర్క్ షాప్ లు..
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణలో దళారీ వ్యవస్థగా నడుస్తుందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు(BJP State General Secretary Kasam Venkateshwarlu) విమర్శించారు. కమిషన్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ పై తెలంగాణ ప్రభుత్వం ఆలసత్వం అవలంబిస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో పార్టీ జెండాను ఎగరవేసి మొక్కను నాటి జిల్లా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈనెల7 నుండి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వర్క్ షాప్ లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వం డిజిటల్ ట్రాన్సాక్షన్ లో 100 శాతం అధిగమించి. భారత ప్రభుత్వం 40 శాతం సంకల్పం సాధించిందని చెప్పారు.
మోడీ ప్రభుత్వం 80 శాతం ప్రజలకు ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పున ఆహార భద్రత కార్డు కలిగిన ప్రజలందరికీ ఉచితంగా అందిస్తుందన్నారు. 370 ఆర్టికల్ భారతదేశంలో అంతర్భాగం అని దీనిని ఎవరు విడదీయరన్నారు. అయోధ్య రామ మందిరం పూర్తి చేయడంలో ప్రధానమంత్రి మోడీ కృషి అమోఘం అన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని నలిపివేశారని ఇది మోడీ ప్రభుత్వం ఘనత అన్నారు. 2014 నుండి 2024 వరకు రైతులకు బిజెపి ప్రభుత్వం చేపట్టిన ఎంఎస్పి ద్వారా రైతులు రెట్టింపు ఆదాయం పొందారని పేర్కొన్నారు. పిఎం కిసాన్ ద్వారా దేశంలో 12 కోట్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెంబర్ 2 స్థాయి గల ఇద్దరు మంత్రులున్న ప్రజా సమస్యల పరిష్కరించడంలో శూన్యమని విమర్శించారు. ఎస్ఎల్ బి సి స్వరంగా మార్గంలో 8 మంది కార్మికులు చనిపోతే కేవలం రెండు మృతదేహాలు బయటకు తీసి, 6 ఆరు మృతదేహాలను తీయకుండా చేతులు దులుపుకొన్న అసమర్ధ దద్దమ్మ ప్రభుత్వం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు రేటెంత రెడ్డిగా అభివర్ణించారు. జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు మాధగొని శ్రీనివాస్ గౌడ్, దోనూరి వీరారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా నాయకులు శ్యాం సుందర్, ముత్యాల్ రావు, పిట్టల శ్రీనివాస్, దర్శనం వేణు, ఓరుగంటి వంశీ పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్ తదితరులు పాల్గొన్నారు.