21-06-2025 01:00:20 AM
ఉపాధి హామీ పనులకు రూ. 50 కోట్లు కేంద్రం కేటాయించాలి
దిశా చైర్మన్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్
కామారెడ్డి, జూన్ 20 (విజయ క్రాంతి) కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకం పట్ల చిన్నచూపు చూస్తుందని దిశా చైర్మన్ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో దిశ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ లు పాల్గొని మాట్లాడారు.
ఈ సమావేశంలో 22 శాఖల కు సంబంధించిన అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నామినేటెడ్ ప్రతినిధులకు వారి స్థానాలలో సరైన గౌరవం లభించడం లేదని గౌరవ చైర్మన్ దృష్టికిసభ్యులు తీసుకువచ్చారు. ఈ విషయమై నామినేటెడ్ ప్రతినిధులకు గౌరవం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని దిశా చైర్మన్ సురేష్ షెట్కర్ కలెక్టర్ ను ఆదేశించారు.
వ్యవసాయ శాఖ సమీక్షలో జిల్లా అధికారి తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ తరపున డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తూ యువతకు డ్రోన్ల నిర్వహణపై శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సేంద్రియ ఎరువులు గురించి వాణిజ్య పంటల గురించి రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ ఏడి తిరుమల ప్రసాద్ ను ఆదేశించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ సహాయక సంచాలక భవనం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విద్యాశాఖ అన్ని స్కూళ్లలో టాయిలెట్స్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని లేనిచో త్వరితగతిన పూర్తి చేయాలని విద్యాశాఖను, డిఆర్డిఓ ను దిశా చైర్మన్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్ ఆదేశించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో విద్యుత్తు లైన్లో పెంపునకు అడిగారు. బాయింపల్లి గ్రామంలో రెండు పోల్స్ తాగునీటి కొరకు వేయించాలని ఆదేశించడం అయినది పిట్లం మండలంలో ఒక కిలోమీటర్ రోడ్డు మరమ్మతులు ఫారెస్ట్ అనుమతులు యుద్ధ ప్రాతిపదిగిన పూర్తి చేయాలని ఫారెస్ట్ డిఎఫ్ఓ ని ఆదేశించడం అయినది మరియు నేషనల్ హైవే పోచారం అభయారణ్యంలో ఉన్న 1.5 కిలోమీటర్ భూమి ఫారెస్ట్ అనుమతులు తీసుకోవాలని నిర్ణయించారు.
ఎల్లారెడ్డి శాసనసభ్యులు మాట్లాడుతూ కొత్త నేషనల్ హైవే నిర్మాణంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని వారికి నోటీసులు పంపి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రమాద సూచికలు, మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరడం జరిగింది. సదాశివ నగర్ మండలం పోలీస్ స్టేషన్ వద్ద అండర్ ప్రాసెస్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ కోరారు.
161 హైవే ఎన్వోసీలు ఇప్పించి ఆగిపోయిన భూ నష్టపరిహారం రైతులకు ఇప్పించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లలో మౌలిక వసతులు కల్పించాలని, అలాగే స్కూల్ టాయిలెట్స్ త్వరితగతిన పూర్తి చేయాలనిన్నారు. ఈ సమావేశంలో దిశా కమిటీ సభ్యులు పోగుల కవిత, నడిపి నగేష్, జాదవ్, నౌషా నాయక్, దేశముఖ రాజు , వివిధ శాఖల జిల్లాఅధికారులు పాల్గొన్నారు.