21-06-2025 01:01:59 AM
కామారెడ్డి, జూన్ 20,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ బాలికల , బాలుర పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ లను ప్రారంభించిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పిల్లలు పాల్గొన్నారు.
అనంతరం తెలంగాణ ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నీ కలిసి పెండింగ్ బిల్లుల గురించి వారి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే పెండింగ్ బిల్లులు ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించుకొని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎం కిష్ట గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కూడలి వెంకటేశం తదితరులు ఉన్నారు