విద్యార్థులకు సీఎం చేతులమీదుగా ప్రశంసా పత్రాలు
11-06-2024 02:21 AM
సిద్దిపేట రూరల్, జూన్ 10: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థులు 10 మంది 10 జీపీఏ సాధించి రాష్ట్రంలో మొద టి స్థానంలో నిలిచారు. ఈ మేరకు వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమ వారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి హాజరై విద్యార్థులకు ప్రశం సా పత్రాలు అందజేశారు. అదేవిధంగా 2024 శ్రేష్ఠ పాఠశాల ప్రతిభ పురస్కారాన్ని ఉపాధ్యాయులకు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం లక్ష్మయ్య, ఉపాధ్యా యులు వెంకటేశం, నర్సింలు, కనకరాజుతో పాటు ౧౦ జీపీఏ సాధించిన విద్యార్థులు పాల్గొన్నారు.






