25-06-2025 10:19:08 PM
పాపన్నపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గ మాతను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య(Bakki Venkataiah) బుధవారం కమిషన్ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వారిని ఈవో చంద్రశేఖర్ శాలువాలతో సత్కరించారు. కమిషన్ సభ్యులు నీలిమ దేవి, రాంబాబు నాయక్, శంకర్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్ తో పాటు స్థానిక తహశీల్దారు సతీష్, దేవస్థానం సిబ్బంది, పోలీసు సిబ్బంది ఉన్నారు.