calender_icon.png 26 June, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యా వ్యవస్థలో దోపిడిని అరికట్టాలని ఎంఈఓకి వినతి

25-06-2025 10:16:40 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): విద్య వ్యవస్థలో దోపిడిని అరికట్టాలని హుజురాబాద్ ఎంఈఓ కి ఆజాద్ ఫెడరేషన్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్ కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని ఎంఈఓ కార్యాలయంలో బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన ప్రతి ప్రైవేటు కళాశాలలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓ లను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు నియంత్రణ కమిటీలను అమలు చేయాలన్నారు. కార్పొరేట్ సంస్థలలో పేద విద్యార్థులకు 25 శాతం  కోటాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్, శివ, కుమార్,అరవింద్, అవినాష్, తిరుపతి తోపాటు తదితరులు పాల్గొన్నారు.