రామోజీ గ్రూపు సంస్ధల అధినేత చెరుకూరి రామోజీరావు అస్తమయం
08-06-2024 09:54 AM
తెల్లవారుజామున 4:50 గంటలకు తుదిశ్వాస విడిచిన రామోజీరావు. హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు. ఫిల్మ్ సిటిలోని నివాసానికి రామోజీరావు పార్ధివదేహం తరలింపు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా గుడివాడలో రామోజీరావు జననం. 2018లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న రామోజీరావు.






