26-07-2025 08:30:13 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో,ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.వెంకన్న (ఐఆర్టీఎస్) శనివారం సింగరేణి ప్రధాన కార్యాలయానికి సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని శాఖల జనరల్ మేనేజర్లను, హెచ్ఓడి అధికారుల, విధులను , సింగరేణి సంస్థ పనితీరు, మొదలగు తదితర అంశాలపై, అందరిని అడిగి తెలుసుకుని, సంస్థ అభివృద్ధికి అందరం కలిసి పని చేయాలని తెలియజేసారు.