3 March, 2026 | 2:41 PM

చంద్రగ్రహణం వేళ చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

03-03-2026 12:19 AM

మొయినాబాద్, మార్చి 2: చంద్రగ్రహణం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ దేవాలయం తాత్కాలికంగా మూసివేస్తునట్లు ఆలయ అర్చకులు మరియు అధికారులు వెల్లడించారు. మంగళవారం మార్చి 3 ఉదయం 7:30 గంటలకు నిత్య కైంకర్యాలు ముగిసిన వెంటనే ఆలయ ద్వారాలు మూసివేస్తారు.

గ్రహణం వీడిన అనంతరం సాయంత్రం 7 గంటలకు ఆలయంలో సంప్రదాయబద్ధంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో కూడా భక్తులను లోపలికి అనుమతించరు.తదుపరి రోజు అంటే బుధవారం ఉదయం 6 గంటల నుండి భక్తులు యధావిధిగా స్వామివారిని దర్శించుకోవచ్చని చెప్పారు.భక్తులు గమనించి, తమ ప్రయాణాలను మరియు దర్శన సమయాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని ఆలయ నిర్వహణ కమిటీ విజ్ఞప్తి చేసింది.