16 March, 2026 | 2:57 PM

Breaking News

అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •   ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి   •  

గ్రీన్ భద్రాద్రి మొట్ట మొదటి మహిళా అధ్యక్షురాలిగా చిట్టే లలిత ఏకగ్రీవ ఎన్నిక

18-07-2025 06:32 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి 2025-2026 సంవత్సరానికి గ్రీన్ భద్రాద్రి నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రెడ్ క్రాస్ కార్యాలయం వద్ద ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా చిట్టే లలిత, ప్రధాన కార్యదర్శిగా లకావత్ వెంకటేశ్వర్లు (ఎల్.వి), కోశాధికారిగా పూసం రవికుమారి, వైస్ ప్రెసిడెంట్లుగా సుబ్రహ్మణ్యం, తుమ్మల రాణి, కో ఆర్డినేటర్ గా లాయర్ పామరాజు తిరుమలరావు, జాయింట్ సెక్రటరీగా కమ్మ వాణిరామ్ లను ఏకగ్రీవంగా ఎంపిక చేయటం జరిగింది. తనని అధ్యక్షురాలుగా నియమించిన సంస్థ పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రీన్ భద్రాద్రి ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తానని, భద్రాచలం పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చి దిద్దటానికి తనవంతు కృషి చేస్తానని నూతన అధ్యక్షురాలు చిట్టే లలిత తెలిపారు.