19-06-2025 12:00:00 AM
అయిజ జూన్ 18 : పెద్ద ధన్వాడ ఇత్తనాల్ ఫ్యాక్టరీ సందర్శనకు వెళ్తున్న రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ప్రొఫెసర్ నారాయణరావు,రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సుభాన్ జిల్లా అధ్యక్షులు జెక్క బాలయ్యబుధవారం ఎర్రవల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా మం డల కేంద్రం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు.
మారుమూల ప్రాంతమైన పె ద్ద ధన్వాడ గ్రామంలో నిర్మిస్తున్న ఇత్తనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ, చాలాకాలంగా ప్రజలు కోరుతున్న విషయము తెలిసిందేనన్నారు. ఈనెల నాలుగో తేదీన ఫ్యాక్టరీ యజమానుల గుండాయిజానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేప ట్టిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఈ ఆందోళనల నేపథ్యంలో 40 మంది అ మాయక రైతులపై కేసులు బనాయించి 12 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు 12 గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న సందర్భంగా వారిని పరామర్శించడానికి వెళ్తున్న రాజకీయ పార్టీలను ప్రజాసంఘాలను పరామర్శించకుండగా అ డ్డుకుని అరెస్ట్ దారుణమన్నారు.
ఈ సమావేశంలో పౌర హక్కుల జిల్లా నేత విజయభా స్కర్ రెడ్డి,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగరదొడ్డి వెంకట రాములు, టిడిపి నాయకు లు సుధాకర్ గౌడ్, ప్రజాసంఘాల నాయకులు కృష్ణన్న పౌర హక్కుల నాయకులు ఆంజనేయులు ఎల్కూరు మహేష్ రైతు సం ఘం నాయకులు కర్రెప్ప దేవదానం భీమన్న టిడిపి తదితరులు ఉన్నారు.