27-06-2025 12:33:03 AM
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య బిల్లుల బకాయిలను ప్రభుత్వం మం జూరు చేసింది. రూ.180.38 కోట్ల పెండింగ్ మెడికల్ బిల్లులను చెల్లించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులను సైతం క్లియర్ చేసినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 26,519 మం దికి ఊరట లభించిందని వెల్లడించారు.
గత ప్రభుత్వంలోని 2023 మార్చి 4వ తేదీ నుం చి ఈ ఏడాది జూన్ 25 వరకు ఉన్న బిల్లలను క్లియర్ చేసినట్టు తెలిపారు. తొమ్మిది రోజుల వ్యవధిలోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన ప్రజా ప్రభుత్వం, విపక్షాల అంచనాలను తలకిందులు చేస్తూ మరుసటి రోజే ఉద్యోగుల రూ.180.28 కో ట్ల మెడికల్ రియెంబర్స్మెంట్ బిల్లులను క్లి యర్ చేయడం విశేషమన్నారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, లెక్కకు మించిన సంక్షేమ పథకాలు మరోవైపు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ బిల్లులకు ప్రాధాన్యతనిచ్చామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గత 27 నెలలుగా మెడికల్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రభుత్వం ఒక ఆదర్శ కుటుంబంగా భావించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఈనెల 13న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందేనని, తాజాగా మెడి కల్ బిల్లులను క్లియర్ చేసిందన్నారు. డీఏ పెంపుతో రాష్ర్టంలోని 3.50 లక్షల మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందని, ఒక డీఏకు ప్రతినెలా ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.200 కోట్లు, ఏడాదికి రూ.2400 కోట్ల ఆర్థిక భారం పడుతుందని వెల్లడించారు.
వీటితోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖలో, ప్రణాళికా శాఖలో క్యాడర్ స్ట్రెంత్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల సమస్యల పరిష్కారానికి జా యింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ తుదిదశకు చేరుకుందని, జనాభాను అనుసరించి గ్రామపంచాయతీలను నాలుగు గ్రేడు లుగా విభజిస్తున్నామని పేర్కొన్నారు. వీటి తో పాటు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ పథకం పూర్తిస్థా యిలో సిద్ధమవుతుందని, వివిధ శాఖల్లో ప్ర మోషన్లకు సంబంధించిన డీపీసీ కమిటీలు వేగం పెంచాయని పేర్కొన్నారు.