27-06-2025 12:33:12 AM
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాదు, జూన్ 26 (విజయ క్రాంతి ): అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం. అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ నుండి న్యూ అంబేద్కర్ భవన్ వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించచారు.
ఈ ర్యాలీని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ట్రైని ఐఏఎస్ కరో లీనా చాంగ్ ఎన్. మావి జెండా ఊపి ప్రారంభించరూ ఈ సందర్భంగా కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణ దుర్వినియోగం పై జరుగుతున్న పోరాటంలో అందరూ క్రియాశీల భాగస్వామ్యం కావాలని మాదకద్రవ్యాలు వాడటం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని సమాజంలో ఏ ఒక్కరూ కూడా డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు .
జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి ర్యాలీలో పాల్గొన్న అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బసవ రెడ్డి,ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ సోము రెడ్డి, నిజామాబాద్ ఏసిపి ఎస్ హెచ్ ఓ,పోలీసులు సిబ్బంది, ఐసిడిఎస్ సిడిపిఓ, సూపర్వైజర్లు ఐ సి పి ఎస్, చైల్ హెల్ప్ లైన్ డి హెచ్ ఈ డబ్ల్యూ, సిబ్బంది వివిధ కళాశాల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు