23-06-2025 06:21:48 PM
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నోములు ఉపేందర్ గౌడ్..
మందమర్రి (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరమని అర్హులైన నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్(Congress President Nomula Upender Goud) కోరారు. పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన వారికి మంజూరైన చెక్కులను సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేసి మాట్లాడారు. పట్టణంలోని లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సంబంధిత వార్డు బాధ్యుల చేతుల మీదుగా అందచేయడం జరుగుతుందన్నారు.
అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకునే వారు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో దరఖాస్తులు అందచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నేరువట్ల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి బూడిద శంకర్, పట్టణ ఉపాధ్యక్షులు ఎండి సుకూర్, కడలి శ్రీనివాసరావు, గోగుల రాజయ్య, రాచర్ల రవి లు పాల్గొన్నారు.