23-06-2025 06:19:19 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ మండల కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ(Red Cross Society) సహకారంతో సోమవారం మెగా రక్తదాన శిబిరం ఎస్బిఐ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్బిఐ బ్యాంకు ఏర్పడి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువతి యువకులు తమ రక్తాన్ని ఉచితంగా దానం చేశారు. దాదాపు 100 మందికి పైగా కార్యక్రమంలో కామారెడ్డి రీజనల్ మేనేజర్ జి వెంకటేశ్వర్లు, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, మేనేజర్ హెచ్ ఆర్ రమణ మిగతా ఎస్బిఐ అధికారులు, సిబ్బంది బ్లడ్ బ్యాంక్ సిబ్బంది హాజరైనారు పైగా యువతి యువకులు రక్తాన్ని డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ సునీల్ అందవార్. తాటుకోల్ రోడ్డు బ్రాంచ్ మేనేజర్ స్వామి నిజాంసాగర్ మేనేజర్ భాస్కర్ పాల్గొన్నారు.