28-06-2025 05:32:53 PM
కోదాడ: రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 173 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 58,52,500 లక్షల రూపాయల నగదు కలిగిన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.