calender_icon.png 28 June, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పోట్రు

28-06-2025 05:29:04 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): ఇల్లందు ఏరియాలోని కోయగూడెం, జెకే 5 ఓసీ, సీహెచ్పీలను సింగరేణి  డైరెక్టర్ గౌతమ్ పోట్రు శనివారం సందర్శించారు. మొదట కోయగూడెం సందర్శించి వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించి అక్కడ జరుగుతున్న రోజు వారి బొగ్గు ఉత్పత్తి(Coal Production), రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జీఎం వి.కృష్ణయ్యని అడిగి తెలుసుకున్నారు. ఓసి పనిచేయున్న సర్ఫేస్ మైనర్ భారీ యంత్రం ద్వారా ఉత్పత్తి ప్రక్రియను, బొగ్గు నాణ్యతను పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించి రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలతో బొగ్గు నాణ్యత సామర్థ్యం ఉత్పతి ఐయే లాగా చూడాలన్నారు.

ఉపరితల గనుల్లో ఉద్యోగులకు రక్షణ పరమైన జాగ్రత్తలతో బొగ్గు ఉత్పత్తి తీయాలని సూచించారు. అనంతరం ఇల్లందు  జెకె 5 ఓసీని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను ఓసీ కాలపరిమితి గురించి జియంని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సి. హెచ్. పి. లోని లోడింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి బొగ్గు రవాణా, బొగ్గు గ్రేడ్ లను పరిశీలించి నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలని అన్నారు. అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయాన్నీ సందర్శించారు. ఈ సందర్భంగా జియం వి.కృష్ణయ్య  పూల మొక్కతో శాలువాతో ఘనంగా స్వాగతించారు. నూతన ప్రాజెక్టు జెకే ఓసి(పూసపల్లి) మైన్ వివరాలను, వాటి యొక్క రికార్డులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైసిఓఏ క్లబ్ లో ఇల్లందు ఏరియా ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.