22-11-2025 10:16:02 AM
హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) హైదరాబాద్ లో పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తికి పయనం అయ్యారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతిద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు ప్రముఖులు, సీనియర్ అధికారులు వీడ్కోలు పలికారు. పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొనున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ముర్ముకి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ ఘన స్వాగతం పలికారు.