శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
26-08-2024 02:06 PM
హైదరాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మానవ జీవితంలో ‘గీత’ బోధనలు ప్రభావశీలమైనవనీ, మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటారని అన్నారు. ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సందేశంలో శ్రీకృష్ణుడు రచించిన పవిత్ర గ్రంథం 'గీత' ప్రాముఖ్యతను గురించి వివరించారు. జీవితంలోని అన్ని దశలలోనూ ప్రజలను నడిపించడానికి 'గీత' నుండి పాఠాలు ముఖ్యమన్నారు.






