17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

01-02-2026 01:43 PM

* మెదక్-బొడ్మట్ పల్లి  రహదారిపై ఎల్లాపూర్ బీఆర్ఎస్ నేతల ధర్నా

* సిట్ విచారణ పేరిట మాజీ సీఎం‌ కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం సిగ్గుచేటు

* సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

పాపన్నపేట: కేసీఆర్ పై సిట్ విచారణ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని బీఆర్ఎస్ పార్టీ ఎల్లాపూర్ అధ్యక్షులు పుట్టి సిద్దయ్య, యూత్ నాయకులు అజయ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సిట్ విచారణ పేరిట మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పై మెదక్-బొడ్మట్పల్లి ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి ధర్నా నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా ‌నేతలు నినాదాలు చేసారు. రేవంత్ కు సీఎం సీటులో‌ కూర్చునే అర్హత లేదని, ఎన్నికల ముందు రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం‌ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రివర్గంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై సిట్ విచారణ జరపాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించినందుకు ఆరు గ్యారంటీల‌ పథకాలను అమలు చేయని ప్రభుత్వంపై సిట్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇట్టి ధర్నాలో మండల నాయకులు నిరూడి సత్యం, తాడేపు మహిపాల్, ఎల్లాపూర్ నాయకులు పట్నం శ్రీనివాస్, రమేష్, అమృతి, జైపాల్, గొల్ల శ్రీనివాస్, పుట్టి రవి, కిషన్, శ్రీనివాస్, నిరుడి రవి, నర్సిములు, అఖిల్, మాలేషం, సురేష్, కిష్టయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.