17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేయనున్న ముఖ్యమంత్రి

06-04-2025 10:37 AM

భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బూర్గంపాడు మండలంలో పర్యటించనున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి హుజూర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ పథకం(Fine Rice Distribution Scheme) ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం సారపాకలోని తాళ్ల గుమ్మూరు గ్రామానికి చెందిన సన్నబియ్యం లబ్దిదారుడు బూరం శ్రీనివాస రావు ఇంట్లో భోజనం చేసేందుకు విచ్చేయనున్నారు. సన్నబియ్యం లబ్దిదారుడి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బూరం శ్రీనివాసరావు గృహంలో ఆహార పదార్థాలను వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) పరిశీలించారు.