12 May, 2026 | 10:00 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

జైపూర్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

11-12-2024 03:20 PM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైపూర్ చేరుకున్నారు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. బంధువుల వివాహం కోసం సీఎం జైపూర్ కు వెళ్లారు. రేవంత్ రెడ్డి బుధవారం నుంచి మూడు రోజుల పర్యటన నిమిత్తం జైపూర్‌తో పాటు న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. జైపూర్ తర్వాత ముఖ్యమంత్రి గురు, శుక్రవారాల్లో న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. దేశ రాజధానిలో రెండు పర్యటనల సందర్భంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో పాటు పార్టీ సీనియర్ నేతలను కూడా కలవనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పాటు ఇతర సీనియర్‌ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.