21 March, 2026 | 7:31 AM

తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌పై సీఎం సమీక్ష

30-11-2025 09:00 AM

హైదరాబాద్: డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమ్మిట్‌పై ఆదివారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్ ను ఖరారు చేయనున్న కీలక అంశాలపై  ముఖ్యమంత్రి చర్చించి తుది రూపుపై దిశానిర్దేశం చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్‌ను ప్రోత్సహించడానికి, భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ శిఖరాగ్ర సమావేశానికి జరుగుతున్న ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.