24-05-2025 01:03:41 AM
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో శనివారం జరిగే నీతిఆయోగ్ సమా వేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం హస్తినకు వెళ్లారు. వికసిత్ రాజ్య పర్ వికసిత్ భారత్ ఎజెండాగా ఏర్పాటు చేసిన నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో తెలంగాణ రైజింగ్- 2047 విజన్ను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారు.
2047 నాటికి తెలంగాణ రాష్ర్టం సాధించే లక్ష్యాలు.. పాలసీలు.. సుపరిపాలన విధానాలు.. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ, సహకారాలపై రాష్ర్టం తరఫున ప్రత్యేక నివేదిక సమ ర్పించనున్నారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యం గా పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్తో ముందుకు సాగుతున్న విషయాన్ని సీఎం వివరించనున్నారు.
తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా పెట్టకున్న సీఎం రేవంత్రెడ్డి.. ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్లో ముందున్న తెలంగాణ, ఆయా రంగా ల్లో మరింత ముందుకు దూసుకెళ్లేలా ప్రజాప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరిం చనున్నారు.
ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూని వర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్లుగా మారుస్తూ మౌలిక వసతుల కల్పన, యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ప్రపంచస్థాయి సౌకర్యాలతో కూడిన యూనివర్సిటీల ఏర్పాటుపై సీఎం ప్రసంగించనున్నారు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి చేసిన రుణమాఫీ, వరికి బోనస్, సంక్షేమంలో భాగంగా అందిస్తున్న సన్నబి య్యం, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే పథకం, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500కే సిలిండర్ సరఫరా వంటి అంశాలను సీఎం ప్రస్తా వించనున్నారు.
సామాజిక సాధికారితలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిం చాలని శాసనసభలో తీర్మానించిన విషయా న్ని కూడా నీతిఆయోగ్లో సీఎం రేవంత్రెడ్డి ప్రముఖంగా ప్రస్తావించనున్నారు.
2018 తర్వాత తొలిసారిగా..
2018 తర్వాత తొలిసారిగా నీతిఆయోగ్ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం హాజరవుతున్నారు. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక నీతిఆయోగ్ సమావేశానికి దూరంగా ఉన్నారు. కేసీఆర్ స్థానంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు వెళ్లేవారు. కాగా, శనివారం భారత్ మండపంలో ప్రధాని మోదీ, ఇతర రాష్ట్రాల సీఎంలతో తెలంగాణ సీఎం అల్పాహారం చేయనున్నారు. ఆ తర్వాత గ్రూప్ ఫొటో దిగుతారు.