17 April, 2026 | 11:15 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

చెరుకు ఫ్యాక్టరీని పునరుద్దరించండి

24-05-2025 01:02 AM

సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి వినతి పత్రం అందజేత

పటాన్ చెరు, మే 23 : జహీరాబాద్ లో మూతబడిన చెరుకు ఫ్యాక్టరీని  పునరుద్దరించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. శుక్రవారం జహీరాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి పలు సమస్యలను విన్నవించారు. 

 జహీరాబాద్ లో చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నారని వారిని దృష్టిలో పెట్టుకొని మూతబడిన ట్రైడెంట్  చక్కెర కార్మాగారాన్ని తిరిగి పునరుద్దరించాలని కోరారు. అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న జహీరాబాద్ ప్రాంతంలో విద్యార్థుల కోసం ఐటీఐ, డైట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ రాతపూర్వకంగాసీఎంనుకోరారు