సంజీవయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం
14-02-2025 01:27 PM
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి(Damodaram Sanjivayya Jayanti) సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి సంజీవయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ లు పటేల్ రమేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యులు చారగొండ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యె సంపత్ కుమార్, తదితరులు హాజరయ్యారు.




