30 May, 2026 | 2:40 AM

ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక భరోసా

30-05-2026 12:37 AM

కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ ఇంచార్జి భరత్

చేవెళ్ళ /షాబాద్ మే 29(విజయక్రాంతి ): చేవెళ్ళ నియోజకవర్గంలోని షాబాద్ మండలం పోతుగల్  గ్రామానికి చెందిన భుజంగ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన  చెక్కును  చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రజలు అనారోగ్యం భారిన పడితే అధైర్యపడొద్దని ప్రభుత్వం నిరుపేదలను సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికంగా ఆదుకుంటోందిని తెలిపారు. సిఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. వీరితో పాటుగా పాల్గొన్న  పోతుగల్ సర్పంచ్ పామేన నర్సింలు, లింగ రెడ్డి గూడ శేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.