కోస్ట్గార్డ్ డీజీ రాకేశ్ మృతి
19-08-2024 12:59 AM
చెన్నై, ఆగస్టు 18: ఇండియన్ కోస్ట్గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. ఛాతీలో నొప్పి రావటంతో ఆదివారం ఉదయం ఆయన చెన్నైలోని రాజీవ్గాంధీ జనరల్ దవా ఖానలో చేరారు. తీవ్రమైన గుండెపోటు రావటంతో ఆయన మరణిం చినట్టు వైద్యులు ప్రకటించారు. రాకేశ్పాల్ ఉత్తరప్రదేశ్కు చెందినవారు. కోస్ట్గార్డ్లో 1989లో చేరారు. గత ఏడాది జూలైలో డీజీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మృతికి రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ సంతాపం ప్రకటించారు.




