27-05-2025 10:56:18 PM
నిర్మల్ (విజయక్రాంతి): సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్షంలోనూ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ధాన్యపు సంచుల లోడింగ్, లారీల తరలింపు ప్రక్రియ సజావుగా జరుగుతుందో లేదో పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ.. ప్రత్యేక సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికే జిల్లాలోని అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో దాదాపుగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, ముందస్తు వర్షాల వల్ల వరి ధాన్యం అమ్మకంలో రైతులకు ఇబ్బందులు కలుగుతుందన్నారు. వరి ధాన్యం కొలుగోలుపై రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని వారికి ధైర్యం చెప్పారు. అధికారులంతా నిరంతరం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, ఆర్డిఓ రత్న కళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.