15 April, 2026 | 1:55 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

03-02-2026 04:18 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వివిధ వార్డులు, పలు విభాగాలను పరిశీలించి, చికిత్స పొందుతున్న రోగులను వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రక్త నిల్వ గదిని పరిశీలించి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై విచారించి వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారిలో సామాన్యులు, ఆదివాసి గిరిజనులు ఎక్కువగా ఉంటారని, వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. రోగుల ఆరోగ్య స్థితిగతులపై వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు ప్రవీణ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుబోద్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.