03-02-2026 04:04:53 PM
ఆదాయం రూ.21 లక్షల 988
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు నిర్వహించారు, రూ.21,00,988ల ఆదాయం వచ్చింది, మానేటి రంగనాయక స్వామి దేవాలయంలో జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్, జాతర కమిటీ డైరెక్టర్లు నేరెళ్ల రాజయ్య, అడ్డగుంట శ్రీనివాస్, కోమల ప్రశాంత్, సిరిసిల్ల కళావతి, ఆలయ ఈవో శంకరయ్య, ప్రవీణ్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.
ఇతర వాటికి సంబంధించి రూ.2,100, జాతర వేలం పాటల ద్వారా రూ.5,80,332, టికెట్ల విక్రయం ద్వారా రూ.3,10,870, హుండీల ద్వారా రూ.12,07,686 ఆదాయం వచ్చిందని చైర్మన్ చంద్రయ్య గౌడ్ తెలిపారు, మొత్తంగా రూ.21,00,988 జాతర ఆదాయం వచ్చిందని, వీటితోపాటు ఒక గ్రామ్ 700 ల మిల్లి గ్రాముల బంగారం, 375 గ్రాముల మిశ్రమ వెండి కానుకలు వచ్చాయని తెలిపారు.. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం లో సుల్తానాబాద్ కు చెందిన రాజరాజేశ్వరి సేవా సంస్థ కో...ఆర్డినేటర్ కొమురవెల్లి చంద్రకళ ఆధ్వర్యంలో 35 మంది మహిళలు పాల్గొన్నారు...