15 April, 2026 | 12:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నీరుకుల్లా సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు

03-02-2026 04:04 PM

ఆదాయం రూ.21 లక్షల 988

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు నిర్వహించారు, రూ.21,00,988ల ఆదాయం వచ్చింది, మానేటి రంగనాయక స్వామి దేవాలయంలో జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ కాంపల్లి సతీష్ కుమార్, జాతర కమిటీ డైరెక్టర్లు  నేరెళ్ల రాజయ్య, అడ్డగుంట శ్రీనివాస్, కోమల ప్రశాంత్, సిరిసిల్ల కళావతి, ఆలయ ఈవో శంకరయ్య, ప్రవీణ్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.

ఇతర వాటికి సంబంధించి రూ.2,100,  జాతర వేలం పాటల ద్వారా రూ.5,80,332, టికెట్ల విక్రయం ద్వారా రూ.3,10,870, హుండీల ద్వారా రూ.12,07,686 ఆదాయం వచ్చిందని చైర్మన్ చంద్రయ్య గౌడ్ తెలిపారు, మొత్తంగా రూ.21,00,988 జాతర ఆదాయం వచ్చిందని, వీటితోపాటు ఒక గ్రామ్ 700 ల మిల్లి గ్రాముల బంగారం, 375 గ్రాముల మిశ్రమ వెండి కానుకలు వచ్చాయని తెలిపారు.. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం లో సుల్తానాబాద్ కు చెందిన రాజరాజేశ్వరి సేవా సంస్థ కో...ఆర్డినేటర్ కొమురవెల్లి చంద్రకళ ఆధ్వర్యంలో 35 మంది మహిళలు పాల్గొన్నారు...