calender_icon.png 31 December, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థిని కొట్టిన ఘటనపై కలెక్టర్ రాహుల్ శర్మ సీరియస్

31-12-2025 12:07:31 AM

వార్డెన్‌ను సస్పెండ్, క్రిమినల్ కేసు నమోదు 

 జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), డిసెంబర్ 30 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సి హాస్టల్ లో డిగ్రీ విద్యార్థిని హాస్టల్ వార్డె న్ కర్రతో కొట్టిన ఘటనపై జిల్లా కలెక్టర్ రా హుల్ శర్మ సీరియస్ అయ్యారు. ఈ సంఘటన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ స్వ యంగా హాస్టల్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ చదువుతున్న హాస్టల్ విద్యార్థిని కొట్టడం చాలా బాధాకరమని, తక్షణమే ఎస్సి అభివృద్ధి అధికారి ద్వా రా విచారణ నిర్వహించి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. హాస్టల్లో జరిగిన ఘటనపై ప్రాథమిక విచారణ అనంతరం, విధు ల్లో నిర్లక్ష్యం వహించినందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు వార్డెన్ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. బాధ్యురాలిపై శాఖాపరమైన చర్యలే కాకుండా, క్రిమినల్ కేసు కూడా నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన శిక్ష లు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంక్షేమ అధికారిని ఈ ఘటనపై ప్రత్యే క విచారణాధికారిగా నియమించినట్లు చె ప్పారు. బాధిత విద్యార్థినికి, హాస్టల్లోని ఇతర విద్యార్థినులకు తగిన కౌన్సెలింగ్ ఇచ్చి, వారి లో మనోధైర్యాన్ని నింపేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. హాస్టల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, జిల్లాలోని అ న్ని ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూ ళ్లలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.

విద్యార్థుల భద్రత ప్రధమ ప్రాధాన్య తగా తీసుకుంటామని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్ట పరంగా కఠినంగా శిక్షించబడతారని ఆ యన స్పష్టం చేశారు. హాస్టల్ లో ప్రవేశించిన వ్యక్తి ఎవరు అనేది విచారణ జరుగు తున్నదని, విచారణ నివేదిక రాగానే సంబంధిత వ్యక్తిపై పోలీస్ కేసు నమోదుతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి అధికారి ఇందిర, సంక్షేమ అధికారి మల్లేశ్వరి, డీఈఓ రాజేందర్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.