15 June, 2026 | 1:53 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

తిర్యాణి అడవుల్లో కూంబింగ్

10-02-2026 12:00 AM

ఆసిఫాబాద్ జిల్లాపై నిఘా

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. తిర్యాణి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మహారాష్ట్ర నుంచి తెలంగాణ అటవీ ప్రాంతంలోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు వచ్చిన నిఘా వర్గాల  సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. హైగ్రౌండ్ పోలీసులు అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి జల్లెడ పడుతూ తనిఖీలు చేపడుతున్నారు. అనుమానాస్పద కదలికలపై డేగ కన్నుతో నిఘా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యలలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.