09-08-2024 02:14:54 AM
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాం తి): అమెరికాకు చెందిన ప్రముఖ మీడి యా అండ్ టెక్నాలజీ కంపెనీ కామ్కాస్ట్ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. కామ్కాస్ట్ కంపెనీ ప్రఖ్యాత యూనివర్సల్ స్టూడియోలో ఒక భాగం. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్బాబు.. కామ్కాస్ట్ ప్రతినిధులతో గురువారం భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అవగాహన ఒప్పందం కుదిరినట్లు మంత్రి తెలిపారు. కామ్కాస్ట్ తన జీసీసీని ఏర్పాటు చేయడం హైదరాబాద్ మీడి యా, టెలికాం రంగంలో ఓ మైలురాయి అవుతుందని చెప్పారు. హైదరాబా ద్లో కామ్కాస్ట్ పెట్టుబడులు పెట్టడం వల్ల.. దాని మాతృసంస్థ టాలీవుడ్లోకి ప్రవేశించే అవకాశాలను మరింత మెరుగుప రుస్తుందని సీఎం కార్యాలయం పేర్కొం ది. ఆ సంస్థ పెట్టుబడుల వల్ల టాలీవుడ్ ఖ్యాతి మరింత పెరుగుతుందని చెప్పింది.
కాలిఫోర్నియాకు చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి బృందం
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు తమ బృందం తో ఇప్పటి వరకు న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్లో పర్యటించా రు. గురువారం రాత్రి వీరు కాలిఫోర్నియా కు చేరుకున్నారు. అక్కడ వారికి పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్వినీరెడ్డి ఝాన్సీరెడ్డితోపాటు తెలంగాణకు చెంది న ప్రవాసులు స్వాగతం పలికారు. సీఎం కాలిఫోర్నియాలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.