16-06-2025 12:47:27 AM
కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరోహీరోయిన్లుగా రూపొందిన సినిమా ‘లోపలికి రా చెప్తా’. మాస్బంక్ మూవీస్ పతాకంపై లక్ష్మీ గణేశ్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ బేస్డ్ కామెడీ ఎంటర్టైనర్లో కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. జూలై 5న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ‘మా చిత్రంలో హీరో క్యారెక్టర్ డెలివరీ బాయ్. అందుకే మొదటి పాటను ఓ డెలివరీ బాయ్తో విడుదల చేయించాం. ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. సెన్సార్ పూర్తయింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం” అని చిత్ర దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: దేవ్ జాంద్; డీవోపీ: రేవంత్ లేవాక, అరవింద్ గణేశ్; ఎడిటర్: వంశీ.