16 April, 2026 | 9:01 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

16న విచారణకు రండి

14-06-2025 12:57 AM
  1. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
  2. పాలన చేతగాకనే నాపై కేసులు: కేటీఆర్
  3. సీఎం, నేను ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నాం
  4. నేను లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధం.. మీరు సిద్ధమా సీఎం?

హైదరాబాద్, సిటీ బ్యూరో జూన్ 13 (విజయక్రాంతి): ఫార్ము లా- ఈ-రేస్ కేసు లో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) శుక్రవారం మరోసారి బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. జూన్ 16వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణ కు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. దీంతో ఈఫార్ములా కేసులో మళ్లీ కదలిక వచ్చినట్లయింది.

కేసులో ఏ1 నిందితుడు అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ కాగా, ఏ2 ఐఏఎస్ అరవింద కుమార్, ఏ3 నాటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి. ఏసీబీ ఇప్పటికే ముగ్గురిని విడి విడిగా విచారించింది. తొలి విచారణ పూర్తయి మూడు నెలలు గడుస్తున్నది. కేటీఆర్‌కు నోటీసుల జారీతో మరోసారి ఫార్ములా ఈ-రేసు కేసు తెరమీదకు వచ్చింది. మరోవైపు ఏసీబీ నోటీసులపై  కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

‘రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఎం నాపై అక్రమంగా కేసులు బనాయించారు. నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిని. కాబట్టి, ఏసీబీ అధికారులకు పూర్తి సహకారం అందిస్తా. ఈ-రేసు కేసులో డబ్బు లావాదేవీల గోల్‌మాల్ జరిగిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. నిర్వహణ కోసం ఈ-రేస్ నిర్వహణ సంస్థ ఖాతాలో తమ ప్రభుత్వం జమ చేసిన రూ.44 కోట్లు, ఇప్పటికీ అదే ఖాతాలో ఉన్నాయి. సీఎం ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు.

ప్రజలను ఆ విషయం నుంచి మళ్లించేందుకే సీఎం నాటకాలాడుతున్నారు. సీఎం, నేను ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నాం. ఈ-రేసు కేసులో నేను మీడియా మాధ్యమాలు, న్యాయమూర్తుల సమక్షంలో లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధం. సీఎం రేవంత్‌రెడ్డి గారు మీరు లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?’ అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రం దివాళా తీసిందని సీఎం అనేక సభల్లో ఉద్ఘాటించారని, విచారణలు, ప్రచారంపేరుతో ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని సీఎంను కేటీఆర్ ప్రశ్నించారు.