11 May, 2026 | 11:17 AM

కుంభమేళాకు రండి..

13-01-2025 02:36 AM

కేంద్రమంత్రి బండి సంజయ్‌కు ఆహ్వానం

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాం తి): సోమవారం నుంచి ప్రారంభం కానున్న కుంభమేళాకు హాజరుకావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు ఉత్తరప్రదేశ్ సర్కార్ ఆహ్వానం పంపింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి అనిల్ రాజ్ భార్ ఆదివారం హైదరాబాద్‌లోని కేంద్రమంత్రి నివాసానికి వచ్చి ఆయన్ను సాదరంగా ఆహ్వానిం చారు. ప్రయాగ్‌రాజ్ లో నేటి నుంచి ప్రారంభం కానున్న ‘మహాకుంభమేళా’కు రావాలని కోరారు. గంగాలంతోపాటు ఆహ్వాన పత్రికను బండి సంజయ్‌కు అందజేశారు.