కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు 11వ వర్ధంతి
ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని పార్టీ కార్యాలయంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సంస్థ స్థాపకుడు కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పంగ అంజయ్య మాట్లాడుతూ... కళ కల కోసం కాదని, కళ కాసుల కోసం కాదని, కళ ప్రజల కోసమని ప్రజా చైతన్యం కోసమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసమని భావించి కామ్రేడ్ కానూరి బాల్యం నుండి తన జీవితమంతా నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో ప్రజలను చైతన్యం చేయడానికి వివిధ కళారూపాలలు ప్రదర్శించాడని తెలిపారు. కామ్రేడ్ కానూరి జీవితం నేటి రచయితలకు, కవులకు, కళాకారులకు, గాయకులకు, స్ఫూర్తిదాయకమని తెలిపారు.




