4 July, 2026 | 9:54 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

భారత్‌ను పాక్‌తో పోలుస్తారా?

26-09-2024 02:03 AM

కర్ణాటక జడ్జీపై సుప్రీంకోర్టు మండిపాటు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: న్యాయమూర్తులు ఏ వర్గానికి సంబంధించి పక్షపాత ధోరణి అవలంబించవద్దని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఓ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక జడ్జి వాఖ్యలను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఆ కేసు విచారణ ముగింపు సందర్భంగా బుధవారం సీజేఐ ఘాటుగా స్పందించారు. ‘భారత్‌లోని ఏ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోల్చడం సరికాదు.

ఇది దేశ ప్రాదేశిక సమగ్రతకు విరుద్ధం. న్యాయమూర్తులు కేసుల విచారణ సమయంలో ద్వేషపూరితంగా, ఓ వర్గాన్ని ఉద్దేశించేలా పక్షపాత వ్యాఖ్యలు చేయవద్దు’ అని సీజేఐ తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల సదరు జడ్జి బహిరంగ క్షమాపణలు చెప్పడంతో సుమోటో కేసును మూసివేస్తున్నట్లు సీజేఐ స్పష్టం చేశారు. కాగా ఇటీవల ఓ భూవ్యవహారానికి సంబంధించిన కేసులో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.