27 August, 2026 | 8:01 AM

హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను

04-07-2026 09:09 PM

చుంచుపల్లి,(విజయక్రాంతి): హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా కొత్తగూడెంకు చెందిన సాయి భాను నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు,బొడ్డపాటి దాసు నియామకపత్రాన్ని  అందచేశారు. శనివారం రాష్ట్ర కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాయిబాను స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలకు మానవ హక్కులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, చట్టాలపై అవగాహన కల్పిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాల కమిటీలను సమన్వయపరుస్తూ సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తానని అన్నారు. ఈ మేరకు తనకు పదవి కేటాయించిన జాతీయ అధ్యక్షులు బొడ్డపాటి దాసుకు, రాష్ట్ర అధ్యక్షులు కాల్వ సుధాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.