17 April, 2026 | 5:43 PM

తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం సరైనది కాదు

17-04-2026 04:10 PM

బోథ్,(విజయక్రాంతి): పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్తో పోల్చడం సరైనది కాదని సోనాల మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు చౌహాన్ వినోద్ డిసిసి కార్యదర్శి దూలకు పోశెట్టిలు విమర్శించారు. ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుంచుకోవాలన్నారు. ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ అధ్యక్షులు జింగాల భోజన్న మాజీ సర్పంచ్ సోయం బాపూరావు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  సుదర్శన్, రామ్మాయి రాము మునేశ్వర్ సోమన్న భీమ్రావు పాటిల్, సుధీర్ కుమార్, జి బోజరాజు, తదితరులు పాల్గొన్నారు.