22 May, 2026 | 8:27 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

19-06-2024 12:10 AM

రంగారెడ్డి, జూన్ 18 (విజయక్రాంతి): షాద్‌నగర్ నియోజకవర్గం చౌదరిగూడం మండలంలోని మండల మహిళా సమాఖ్య కేంద్రంలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న రామస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ మంగళవారం మౌనిక, నస్రీన్ బేగం అనే మహిళలు స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా మహిళా సమాఖ్య కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తమను ఏపీఎం రామస్వామి లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాగా, ఏపీఎం రామస్వా మి సైతం తనపై కుట్రతోనే కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ రిపోర్టర్ సత్యనారాయణ గౌడ్, బుగ్గరాజు, వీవోఏల యూనియన్ నాయకుడు మైనోద్దిన్, శంకర్ అనే వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనంటే గిట్టని వారంతా మహిళలతో ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.