25 April, 2026 | 5:17 PM

Breaking News

శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •   మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం   •   ఆడపిల్లలకు వరం హెచ్పీవీ వ్యాక్సిన్   •   ప్రచారం కోసమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం   •  

గీత కార్మికుడికి పరామర్శ

25-04-2026 04:17 PM

* సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్

కడ్తాల్: మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు జంగయ్య రోజువారీ పనిలో భాగంగా  తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవాశత్తు ​చెట్టుపై నుంచి కింద పడటంతో శరీరానికి బలమైన గాయాలయ్యాయి.గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ​బాధిత కుటుంబాన్ని సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్గౌడ్, స్థానిక నాయకులు సుమన్, నరసింహ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

జంగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.గీత కార్మికులు వృత్తి రీత్యా ఎంతో ప్రమాదకరమైన పని చేస్తున్నారు. జంగయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రమాద సమయాల్లో గీత కార్మికులను ఆదుకోవాలని కోరారు.