calender_icon.png 15 June, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి 'దర్తి ఆభ జన్ భాగీ దారి అభియాన్' పథకంపై సదస్సులు

14-06-2025 07:17:46 PM

అశ్వాపురం (విజయక్రాంతి): భద్రాచలం ఐటిడిఏ పిఓ బి.రాహుల్(ITDA PO B.Rahul) ఆదేశాల మేరకు అశ్వాపురం మండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఈనెల 15వ తేదీ నుండి 30 వ తారీకు వరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'దర్తి ఆభ జన్ భాగీ దారి అభియాన్' పథకం సాచురేషన్ క్యాంపులు నిర్వహించబడునని అశ్వాపురం మండల ఎంపీడీవో ముత్యాలరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఈ ప్రకటనలో పేర్కొన్న అంశాలు 17వ తేదీన గొందిగూడెం, 19వ తేదీన తుమ్మలచెరువు, 27వ తేదీన బట్టిల గుంపు, 28వ తేదీన వెంకటాపురం గ్రామపంచాయతీలలో ఉదయం 9:30 లనుండి  నిర్వహించబడునని,  ఈ సదస్సుల్లో ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రము, ఓటు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, కిసాన్ క్రెడిట్ కార్డు, కిసాన్ సమ్మన్ నిధి యోజన, ఆయుష్మాన్ భారత్, మాతృ వందన, ఎఫ్ ఆర్ ఎ పట్టాలు, జన్ దన్, ఎన్ఆర్ఈజీఎస్ కార్డులు ఇతర సంబంధిత సామాజిక భద్రత పథకాల మీద అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.

అవగాహన సదస్సులో గిరిజన ప్రజలు పాల్గొని ఆయా పథకాల ప్రయోజనాలు తెలుసుకొని వాటి ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమమునకు సంబంధిత శాఖ అధికారులు రెవిన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, వైద్యశాఖ, ఐసిడిఎస్, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మరియు సంబంధిత బ్యాంకు మేనేజర్లు హాజరవునని తెలిపారు.