14-06-2025 07:20:03 PM
వనపర్తి టౌన్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(Telangana Working Journalists Federation) ఇటీవల ఏర్పడిన జిల్లా నూతన కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్(District SP Ravula Giridhar)ను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే అందజేశారు. జిల్లా కమిటీ అధ్యక్షులు జూటూరు రాము, జిల్లా కార్యదర్శి అక్కల శ్రీనివాస్ గౌడ్ లను ఎస్పీ అభినందించి నూతనంగా ఏర్పడిన జిల్లా కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సంఘం సభ్యులంతా ఒక సొసైటీగా ఏర్పడాలని సూచించారు. నెలకు సంపాదించే దాంట్లో ఎంతో కొంత నగదును పోగు చేసుకోవాలని, దాని ద్వారా వనరులను సమకూర్చుకోవాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, దానికి తోడు ఆర్థిక తోడ్పాటును ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఉమ్మడిగా స్థలాలు కొనుక్కొని సొంత ఇంటి నిర్మాణాలు చేపట్టుకోవాలని సూచించారు. అవసరమైతే సంఘం సభ్యులందరూ గ్రూప్ ఇన్సూరెన్స్ ను తీసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నూతనంగా ఏర్పడిన జిల్లా కమిటీ హుందాగా నడుచుకుంటూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, యూనియన్ నాయకులకు జిల్లా పోలీసుల సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు కే సురేందర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు జి విష్ణువర్ధన్ ఉన్నారు.