17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అభివృద్ధి ప్రధాత ‘వేం’కు అభినందనలు వెల్లువ

21-04-2025 12:56 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్య సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి తదితరులు అభినందనలతో ముంచెత్తారు.

కేసముద్రం పట్టణంలో కొత్తగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 1.50 కోట్లు, ముస్లిం షాది ఖానా నిర్మాణానికి 80 లక్షలు, స్మశాన వాటిక కోసం 90 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను ఆదివారం ఎమ్మెల్యే మురళి నాయక్ చేతుల మీదుగా సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అందజేశారు.

అనతి కాలంలోనే కేసముద్రం మండలాన్ని ఊహించని విధంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తూ సొంత మండలంపై మమకారాన్ని చాటుకుంటున్న వేం నరేందర్ రెడ్డి కి మిఠాయిలు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు గుగులోతు దస్రు నాయక్, డివైసిసి అధ్యక్షుడు సురేష్, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, ట్రాన్స్పోర్ట్ కమిటీ డిస్టిక్ అథారిటీ మెంబర్ రావుల మురళి, నాయకులు బండారు దయాకర్ తదితరులున్నారు.