08-06-2025 12:58:29 AM
మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతుకు అవకాశమున్నా కాలయాపన ఎందుకు: కేటీఆర్
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నాయని, వీటిని తిప్పికొట్టేందుకు మాజీమంత్రి హరీశ్రావు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు కాంగ్రెస్ దుర్మార్గపు పాలనలో మాయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశా రు.
శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై హరీశ్రావు నిర్వహించిన పవర్పాయింట్ ప్రజేంటేషన్ కార్య క్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. పరిపాలన చేతకాని సీఎం, కాంగ్రెస్ సర్కార్ ఉద్యమ నినాదానికి పాతరేసి, దుర్మార్గపు విధానంతో రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్పై నిందలు, కాంట్రాక్టర్తో దందాలు, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు చందాలు ఇదే అధికార పార్టీ పాలనలా మారిందన్నా రు.
తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే కేసీఆర్ కాలంతో ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని కేటీఆర్ తెలిపారు. పాలమూరు సీతారామ ప్రాజెక్టులను 90శాతం పూర్తి చేశామన్నారు. అను మతి లేకుండా ఏపీ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నా సీఎం, కాంగ్రెస్ మం త్రు లు, బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
గుజరాత్లో మోర్బీ బ్రిడ్జి కూలి 140 మంది చనిపోయినా ఎన్డీఎస్ఏ కానీ, ఏ ఏజెన్సీ కానీ ఇప్ప టి దాకా నోరు మెదపలేదన్నారు. బీహార్లో నాలుగురోజులకు ఒక బ్రిడ్జి కూలి నా ఏ ఏజెన్సీ స్పందించలదేని కేటీఆర్ వాపోయా రు. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలినా ఎన్డీఎస్ఏ రాలేదని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 బమంది చనిపోయినా, వ ట్టెం పంపుహౌస్ మునిగినా, పెద్దవాగు కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏ రాలేదన్నారు.
ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో ఎన్డీఏ తయారు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ రిపోర్ట్ చెత్తబుట్టలో వేయటానికి తప్ప దేనికి పనికి రాదని ఎల్అండ్టీ సంస్థ తేల్చి చెప్పిందన్నారు. తెలంగాణ నుంచి సీఎం పంపిన మూటలతోనే కాంగ్రె స్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనం కట్టుకుందని కేటీఆర్ ఆరోపించారు.
దాన్ని కూడా ఎల్అండ్టీ సంస్థే నిర్మించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీల కుట్రను జిల్లాస్థాయిల్లోకి వెళ్లి వివరిస్తామని కేటీఆర్ చెప్పారు. మేడిగడ్డ పిల్లర్ల కు మరమ్మతు చేసి, రైతులకు నీళ్లిచ్చే అవకాశమున్నా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మాగంటి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. త్వరగా మాగంటి కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, రవీందర్రావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు.