18-06-2025 12:04:24 AM
బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి ): ఎన్నికల హామీలను నెరవే ర్చడంలో కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పూర్తిగా విఫల మయ్యా రని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిం దలు వేస్తూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధి కార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శించారు. రేవంత్రెడ్డి పదే పదే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అంగీకరించడం సమర్థవంతంగా పాలించ లేక పోవడాన్ని స్పష్టం చేస్తోందని ఆయ న మంగళవారం ప్రకటనలో ఆరోపించారు.
ఎన్నికలకు ముందు తమ పార్టీకి ఆర్థిక నిపుణులు ఉన్నారని, ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని బయటపడేస్తారని రేవంత్రెడ్డి చెప్పారని ఆ నిపుణులు ఇప్పుడెక్కడ ఉన్నారని సుభాష్ ప్రశ్నించారు. మహాలక్ష్మి, రై తు భరోసా వంటి కీలక పథకాలను అమలు చేయడానికి డబ్బులు లేవని సీఎం పదేపదే ఎందుకు చెప్పాల్సి వస్తోందన్నారు.
గత ప్రభుత్వం చెల్లించని బిల్లులకు, పేరుకుపోయిన రు ణాలకు గత సీఎం బాధ్యత వహించాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొనడం ఆడలేక మద్దెలోడు సామెతను గుర్తు చేస్తోందన్నారు. రేవంత్రెడ్డి హమీలను అమలు చేయలేకపోతే సమ ర్థులకు అవకాశం ఇస్తూ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.